పీవీ సింధు, మిథాలీకి ప్రధాని మోడీ ప్రశంసలు

పీవీ సింధు, మిథాలీకి ప్రధాని మోడీ ప్రశంసలు

న్యూఢిల్లీ: క్రీడల్లో మన అమ్మాయిలు అదరగొడుతున్నారని, వారి సేవలు అపూర్వమని ప్రధాని మోడీ కొనియాడారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌‌లో క్రీడల్లో మహిళల రాణింపుపై మోడీ మాట్లాడారు. ‘ఇది మార్చి నెల. ఈ నెలలోనే మనం విమెన్స్ డేను జరుపుకుంటున్నాం. మన దేశం తరఫున చాలా మంది మహిళలు ఎన్నో విజయాలు, రికార్డులు సాధించారు. పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌‌ను గెలుపొందింది. మిథాలీ రాజ్ మహిళా క్రికెట్‌లో 10 వేల రన్స్ కొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, ఈ విజయాలు మర్చిపోలేనివి’ అని మోడీ పేర్కొన్నారు.