దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

ఢిల్లీ : దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని బీజేపీ ఎంపీలతో భేటీ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నివాసంలో ఎంపీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. ప్రధానితో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు హాజరవగా.. ఏపీ నుంచి జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ హాజరయ్యారు.