హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 , 11 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో 'బీసీల ఆత్మగౌరవ సదస్సు' జరగనుంది. 11న సికింద్రాబా ద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉప కులాల 'విశ్వరూప మహాసభ' జరగనుంది. ఈ రెండు సభలకు చీఫ్ గెస్టుగా మోదీ రానున్నారు.
3 రోజుల వ్యవధిలో ప్రధాని 2 సార్లు హైదరాబాద్కు రానుండడంతో ఆయన సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయక త్వం దృష్టి పెట్టింది. దాదాపు నెల రోజుల తర్వాత ప్రధాని మళ్లీ ఎన్నిక ల ప్రచార సభలో పాల్గొనేందుకు రాష్ట్రా నికి వస్తున్నారు. మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఉన్నారు.