మోడీ ఓ మహిళకు భయపడుతున్నారు

మోడీ  ఓ మహిళకు భయపడుతున్నారు

జోర్హట్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలకు దిగారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక.. మోడీని టార్గెట్ చేసుకొని పలు వ్యాఖ్యలు చేశారు. టూల్ కిట్ కేసు వివాదం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. 22 ఏళ్ల మహిళకు మోడీ భయపడుతున్నారని చెప్పారు. ‘ప్రధాని మోడీ శనివారం నాటి ప్రసంగాన్ని చూశా. అభివృద్ధి గురించి ఆయన సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. అస్సాం డెవలప్‌మెంట్ గురించి, బీజేపీ ఇక్కడెలా పని చేసిందో ఆయన చెబుతారని భావించాం. కానీ ఆయన 22 ఏళ్ల మహిళ (దిశా రవి) చేసిన ట్వీట్ గురించి మాట్లాడారు. అస్సాం టీ పరిశ్రమను కాంగ్రెస్ నాశనం చేయాలని కుట్ర పన్నిందని మోడీ అంటున్నారు. కానీ వరదలు వచ్చి ప్రజలు పడిన కష్టాల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?’ అని ప్రియాంక ప్రశ్నించారు.