పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పంజాబ్ సీఎంకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. “నా తమ్ముడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పంజాబ్ ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు మీకు మరింత శక్తిని ప్రసాదిస్తాడు" అని కేజ్రీవాల్ ట్వీ్ట్ చేశారు.
భగవంత్ మాన్ సోమవారం(అక్టోబర్ 17న) 49వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.