కాటారం,వెలుగు : జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన కరెంట్వైరు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్చనిపోయిన కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్చేశారు. కాటారం సీఐ నాగార్జునరావు కథనం ప్రకారం..కాటారం మండల కేంద్రానికి చెందిన ఊదరి రమేశ్, గోగుల రమేశ్, గజ్జెల శ్రీనివాస్కూలీలు. డబ్బులు సరిపోకపోవడంతో జంతువులను కరెంట్షాక్పెట్టి చంపి మాంసం అమ్ముతూ బతుకుతున్నారు. ఈనెల11న అడవిలో వీరు అమర్చిన కరెంట్తీగలకు తగిలి కూంబింగ్కు వచ్చిన ఆదిలాబాద్జిల్లా నార్నూల్మండలం రాజోలిగూడకు చెందిన గ్రేహౌండ్కానిస్టేబుల్ఆడే ప్రవీణ్ చనిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్చేసి రిమాండ్చేశారు. కాటారం ఎస్సై అభినవ్పాల్గొన్నారు.