గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్ ​మృతికి కారణమైన వేటగాళ్లు అరెస్ట్

గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్ ​మృతికి కారణమైన వేటగాళ్లు అరెస్ట్

కాటారం,వెలుగు : జయశంకర్​భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్​పల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన కరెంట్​వైరు తగిలి గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​చనిపోయిన కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్​చేశారు. కాటారం సీఐ నాగార్జునరావు కథనం ప్రకారం..కాటారం మండల కేంద్రానికి చెందిన ఊదరి రమేశ్, గోగుల రమేశ్, గజ్జెల శ్రీనివాస్​కూలీలు. డబ్బులు సరిపోకపోవడంతో జంతువులను కరెంట్​షాక్​పెట్టి చంపి మాంసం అమ్ముతూ బతుకుతున్నారు. ఈనెల11న అడవిలో వీరు అమర్చిన కరెంట్​తీగలకు తగిలి కూంబింగ్​కు వచ్చిన ఆదిలాబాద్​జిల్లా నార్నూల్​మండలం రాజోలిగూడకు చెందిన గ్రేహౌండ్​కానిస్టేబుల్​ఆడే ప్రవీణ్​ చనిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్​చేశారు. కాటారం ఎస్సై అభినవ్​పాల్గొన్నారు.