గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిల ఆటకట్టించారు పోలీసులు. హైదరాబాద్ వ్యాప్తంగా మహిళలను వేధించిన 240 మందిని అరెస్ట్ చేశారు. గణేష్ మండపాలు, నిమజ్జన స్థలాల వద్ద షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టాయి.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
హైదరాబాద్ లో గణేస్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో నిమజ్జనం కోసం 35 వేల మంది బలగాలతో పోలుసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరుగుతున్న రూట్లలో ప్రత్యేకంగా 739 సీసీ కెమెరాలు అమర్చారు. ట్యాంక్బండ్ పరిసరాల్లో పది డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డీజీపీ ఆఫీస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బషీర్బాగ్ సీపీ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్రను పోలీసులు ట్రాక్ చేశారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో కలిసి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తి చేశారు.