ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్కు పండగే. ధనాధన్ క్రికెట్ తో అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఐపీఎల్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు బెట్టింగ్కు పాల్పడుతున్నారు. బాల్ బాల్కు బెట్టింగ్ కాస్తూ కోట్లు వెనకేసుకుంటారు. ఏ జట్టు గెలుస్తుంది.. ఎవరు ఎక్కువ స్కోరు సాధిస్తారంటూ రకాలుగా బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్ల లావాదేవీలు చేస్తున్నారు. అయితే తాజగా ఇలాంటి బెట్టింగ్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ SOT పోలీసులు, చైతన్య పురి పోలీసులు ముగ్గురు పందెం రాయళ్లు జగదీష్, జక్కిరెడ్డి అశోక్ రెడ్డి, చరణ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల నగదుతో పాటు..వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ. 1.42 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు.