హైదరాబాద్ లో ఈ -సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ లో ఈ -సిగరెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
  • రూ.21 లక్షల విలువైన సరుకు స్వాధీనం

బషీర్​బాగ్​,వెలుగు : అక్రమంగా ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్, సైఫాబాద్ పోలీసుల సంయుక్తంగా గురువారం ఆదర్శ్‌‌‌‌నగర్‌‌‌‌లోని ప్రిన్స్‌‌‌‌టన్‌‌‌‌ కోడ్ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో సోదాలు చేశారు. రూ.21 లక్షల విలువైన 670 ఎలక్ట్రిక్ సిగరేట్స్(వేప్స్‌‌‌‌) దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు.

వాటిని మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సిండే విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయన ఆదర్శ్ నగర్ లో ఓ వృద్ధుడికి కేర్ టెకర్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు దొడ్డిదారిన డబ్బులు సంపాదించాలని యువతే లక్ష్యంగా ఈ సిగరెట్ల విక్రయం ప్రారంభించాడు. ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు.