కోపంతోనే 3 బస్సులు తగలబెట్టిండు..నిందితుడు అరెస్ట్

కోపంతోనే 3 బస్సులు తగలబెట్టిండు..నిందితుడు అరెస్ట్

హైదరాబాద్  కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న బస్సులు తగలబడిన కేసును పోలీసులు ఛేదించారు. భారతీ ట్రావెల్స్ లో వీరబాబు అనే వ్యక్తి  మూడు బస్సులకు నిప్పుపెట్టాడు. నిందితుడు వీరబాబు ఈ ట్రావెల్స్ లోనే రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ట్రిప్పుల విషయంలో ట్రావెల్స్ ఓనర్ క్రిష్ణారెడ్డి, అతడి తమ్ముడి కొడుకు యశ్వంత్ రెడ్డి కొట్టడంతోనే నిందితుడు కోపంతో మూడు బస్సులను పెట్రోల్ పోసి తగలబెట్టిండని పోలీసులు తెలిపారు. వీరబాబుతో పాటు అతడిపై దాడి చేసిన క్రిష్ణారెడ్డి, యశ్వంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.