హ్యాట్సాఫ్​ పోలీస్: కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు

హ్యాట్సాఫ్​ పోలీస్: కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు

 కరోనా భయానికి అంత్యక్రియలకు రాని గ్రామస్తులు
 పీపీఈ కిట్లు అందించి దహన సంస్కారాలు చేయించిన సీఐ

కాగజ్ నగర్, వెలుగు: కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు గ్రామస్తులెవరూ ముందుకు రాకపోవడంతో సీఐ స్పందించి బాధితులకు అండగా నిలిచారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని తలాయికి చెందిన మాజీ సర్పంచ్ ఆత్రం నిలయ్య తండ్రి దుర్గయ్య (85) కరోనా ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మృతిచెందారు. గురువారం కుటుంబీకులు దహన సంస్కారాలు చేయాలని ప్రయత్నించారు. అయితే అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. కుటుంబీకులు దిక్కుతోచక ఏడుస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న కౌటాల సీఐ స్వామి వెంటనే బెజ్జూర్ ఎస్సై సాగర్ తో కలిసి గ్రామానికి చేరుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ఐదుగురికి పీపీఈ కిట్లు అందజేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు. సీఐ స్వామికి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలియజేశారు.