గోదావరిఖని: మాజీ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు

గోదావరిఖని: మాజీ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో ఈ నెల 9న బీఆర్ఎస్​ లీడర్​ పూదరి సత్యనారాయణగౌడ్​ అరెస్ట్​ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు(మంథని), కోరుకంటి చందర్(రామగుండం)​, మంథని మున్సిపల్​ మాజీ చైర్మన్​ పుట్ట శైలజ,  ఇతర లీడర్లపై పోలీసులు కేసు నమోదు  చేశారు. 

ప్రజాశాంతికి భంగం కలిగించడం, నిర్బంధించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకపరచడంపై కానిస్టేబుల్​వెంకటేశ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.