వానరానికి పోలీసుల అంత్యక్రియలు

వానరానికి పోలీసుల అంత్యక్రియలు

వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వానరానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వానరాన్ని వాహనంలో తీసుకొచ్చి పట్టణ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఏఎస్సై కోలా శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుల్ చిట్టి బాబు, కానిస్టేబుల్ దయాకర్ను పలువురు అభినందించారు.

మరిన్ని వార్తల కోసం:

మాట నిలబెట్టుకున్న రాజమౌళి

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు