సంకెళ్లతో ఖైదీ పరార్..తాండూరు హెచ్ సీ సస్పెన్షన్

సంకెళ్లతో ఖైదీ పరార్..తాండూరు హెచ్ సీ సస్పెన్షన్

తాండూరు, వెలుగు: సంకెళ్లతో పోలీస్​స్టేషన్​నుంచి నిందితుడు పరారైన కేసులో వికారాబాద్‌‌‌‌ జిల్లా తాండూరు టౌన్​పీఎస్​కానిస్టేబుల్‌‌‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఢిల్లీకి చెందిన అజీమ్  పట్టణంలోని రైల్వే స్టేషన్‌‌‌‌కు సమీపంలో ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ట్రాప్‌‌‌‌ చేశాడు. 

మే 9న బాలికను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు యత్నించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని కిడ్నాప్​కేసు పెట్టారు. అయితే, ఒకే చేతికి సంకెళ్లు వేసిన పోలీసులు లాకప్​రూమ్​ముందు ఉన్న హాల్​లో ఉంచారు. అప్పుడు స్టేషన్​లో మహిళ ఎస్ఐ, విమెన్​కానిస్టేబుల్, హెడ్​కానిస్టేబుల్ నరేందర్ ఉన్నారు. అయితే, అప్పుడే వేరే ఫిర్యాదు రాగా దానికి సంబంధించి ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు. ఇదే సమయమని అనుకున్న అజీమ్​వెనక తలుపు నుంచి బొందలగడ్డవైపు పరారయ్యాడు. కొద్దిసేపటికి నిందితుడు లేడని తెలుసుకున్న పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. నిందితుడు పారిపోయాడని బయటకు పొక్కడంతో తామే బెయిల్​ఇచ్చి పంపించివేశామని మ్యానేజ్​చేశారు. ఆధార్​కార్డుపై అడ్రస్​ఆధారంగా ఢిల్లీకి వెళ్లి అజీమ్​ను పట్టుకువచ్చారు. 

బాలికను పిలిపించి ఆమె ఫిర్యాదు ఆధాంరగా పోక్సో కేసు పెట్టి రిమాండుకు తరలించారు. కాగా, నిందితుడి పరారైన ఘటనను సీరియస్​గా తీసుకున్న ఉన్నతాధికారులు హెడ్​కానిస్టేబుల్​నరేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి సస్పెండ్​చేశారు. విచారణ తర్వాత మిగిలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.