హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జాబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై వాదనలు పూర్తి కావడంతో సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని విజయసేన్రెడ్డి ఇటీవల ప్రకటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఆ తర్వాత తానే కారు నడిపినట్టుగా ఒక వ్యక్తి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ కేసులో తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా రాహిల్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసి బెయిల్ పొందారు.