డ్రగ్స్ కేసు నిందితుడు టోనీ రెండో రోజు విచారణ పూర్తి

డ్రగ్స్ కేసు నిందితుడు టోనీ రెండో రోజు విచారణ పూర్తి

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడు టోనీ రెండో రోజు విచారణ ముగిసింది. గంటల తరబడి అతన్ని ప్రశ్నించిన టాస్క్ఫోర్స్ పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. నైజీరియన్ స్నేహితుడి ద్వారా తాను డ్రగ్స్ బిజినెస్లోకి వచ్చానని చెప్పిన టోనీ.. పలువురు వ్యాపారవేత్తలతో నేరుగా కాంటాక్ట్ ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం. టోనీ హైదరాబాద్ కు ఎన్నిసార్లు వచ్చాడు, ఏఏ ప్రాంతాల్లో ఉన్నాడన్న సమాచారంతో పాటు అతడు అటెండైన ఈవెంట్లు, పబ్లు, రేవ్ పార్టీల గురించి పోలీసులు ఆరా తీశారు. అతని అనుచరులైన ఇమ్రాన్ బాబు షేక్, నూర్ అహ్మద్, ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో ఉన్న లింక్స్పైనా ప్రశ్నించారు. నైజీరియాకు చెందిన స్టార్ బాయ్ కంపెనీతో ఉన్న సంబంధంపైనా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

రెండో రోజు విచారణలో భాగంగా టోనీ ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు ఆరా తీశారు. టోనీ, బాబు షేక్, నూర్ అహ్మద్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరించిన పోలీసులు దాదాపు 10కి పైగా బ్యాంక్ అకౌంట్స్ నుంచి లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. 

For more news..

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

బాలీవుడ్ అందాల తార కాజోల్కు కరోనా