పోలింగ్ శాతాన్ని పెంచాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పోలింగ్ శాతాన్ని పెంచాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • యువతకు సూచించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

బషీర్​బాగ్/మెహిదీపట్నం, వెలుగు : మొదటి సారి ఓటేస్తున్న యువత పోలింగ్​లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  విజ్ఞప్తి చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్​ను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్​తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లకు చెందిన ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ ఆఫీసర్లకు, స్పెషల్ ఆఫీసర్లకు అందజేశామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం మాసబ్ ట్యాంక్​లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన నాంపల్లి సెగ్మెంట్​కు సంబంధించిన డీఆర్సీ సెంటర్ కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న ఈవీఎంల వివరాలను ఆర్వో లావణ్యను అడిగి ఆయన తెలుసుకున్నారు.