గండిపేట, వెలుగు: పాండిచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ రాజేంద్రనగర్లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీని సోమవారం సందర్శించారు. వర్సిటీలోని డెయిరీ, మేకల ఫామ్ను ఆయన పరిశీలించారు.
గోకుల్ గ్రామ్ స్కీమ్(స్వదేశీ పశుజాతుల అభివృద్ధి) కింద వర్సిటీలో చేపట్టిన పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం అత్తాపూర్లోని కేఎంజీ డెయిరీని ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న ముర్రా జాతి బర్రెలను పరిశీలించారు. జయకుమార్ వెంట వెటర్నరీ వర్సిటీ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ మహేందర్, అధికారులు ఉన్నారు.