రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ

రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ ఆయ్యారు.  ఢిల్లీలోని AICC కార్యలయంలో రాహుల్ వారితో చర్చిస్తున్నారు. వీరి వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర, కోమటిరెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ సహా  టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు.  

ALSO READ:రాహుల్ గాంధీతో భేటీ...పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ

2023 జూన్ 05 ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పే సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.  "ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే.  జులై 2న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంక ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటాం” అని తెలిపారు.