బీసీలను కాంగ్రెస్ నిండా ముంచింది: పొన్నాల లక్ష్మయ్య

బీసీలను కాంగ్రెస్ నిండా ముంచింది: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, దానికి ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శిం చారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో పార్టీ ​నాయకులు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న లీడర్లను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారని, అలాంటి పార్టీని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. నందికంటి శ్రీధర్, ఎర్ర శేఖర్, ఈరవత్రి అనిల్, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా, వారి స్థానంలో రెడ్డి నేతలకు టికెట్లు ఇచ్చారన్నారు. బీసీల టికెట్లు ఇతరులకు అమ్ముకున్నోళ్లు బీసీల ప్రయోజనం కోసం ఎలా పని చేస్తారని పొన్నాల ప్రశ్నించారు.