వెయ్యి కోట్లు దాటిన మహాలక్ష్మి స్కీం : పొన్నం ప్రభాకర్​

వెయ్యి కోట్లు దాటిన మహాలక్ష్మి స్కీం : పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే మహిళల సంఖ్య రోజు రోజుకూ లక్షల్లో పెరుగుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాలుగు నెలల్లో రూ.1177 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  స్కీమ్ ప్రారంభమైన తొలి రోజుల్లో.. రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని అన్నారు.

 ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. గతంలో సిటీలో బస్సు పాస్ లు, బస్సు చార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు రూ.1500 వరకు ఖర్చు చేసేవారని.. మహాలక్ష్మి పథకం ద్వారా ఆ మేరకు మహిళలకు డబ్బు ఆదా అవుతుందని అన్నారు.