కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో నాలుగో రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ వెంట హీరోయిన్ పూనమ్ కౌర్ నడుస్తున్నారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఎనుగొండలోని గోపాల్ రెడ్డి గార్డెన్ లో రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్రను కొనసాగించనున్నారు.

రాత్రి 7 గంటలకు జడ్చర్లలో పాదయాత్రను ముగియనుంది. గొల్లపల్లిలోని శ్రీ సద్గురు మహర్షి మలయాల స్వామి లలితాంబిక తపోవనంలో బస చేయనున్నారు. ఈ రోజు మొత్తం 20.3 కిలోమీటర్లు నడువనున్నారు. సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి పాదయాత్ర కొనసాగింది. దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో పాదయాత్ర కొనసాగించారు.