కొత్త రాష్ట్రపతి ముర్ముపై అభిమానం చాటుకున్న సైకత శిల్పి

కొత్త రాష్ట్రపతి ముర్ముపై అభిమానం చాటుకున్న సైకత శిల్పి

భార‌త రాష్ట్రప‌తిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజ‌న నాయ‌కురాలు ద్రౌప‌ది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా పూరీ తీరంలో తన స్టైల్లో ఓ సైకత శిల్పాన్ని రూపొందించాడు అదే రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్. ద్రౌప‌ది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనుండడంతో.. దేశ చరిత్రలో ఈ రోజును చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణిస్తూ.. ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో కూడిన సైకత శిల్పాన్ని రూపొందించాడు. ద్రౌపది ముర్ము ఎన్నికైన రోజున కూడా ఈ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుక ఆర్ట్ ను వేశాడు.