నా కొడుకు ఈ సినిమాకు కథ రాశాడు

నా కొడుకు ఈ సినిమాకు కథ రాశాడు

పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు’. పప్పుల కనక దుర్గారావు నిర్మాత. ఇటీవల సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రెస్‌‌‌‌‌‌‌‌ మీట్ నిర్వహించారు. పోసాని మాట్లాడుతూ ‘నా కొడుకు ఉజ్వల్ దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశాడు. విజయవాడ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేశాం. హీరోగా విలన్‌‌‌‌‌‌‌‌గా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ షేడ్స్ ఉన్న పాత్రలో అశోక్‌‌‌‌‌‌‌‌ నటించాడు. శ్వేత, స్నేహ, శృతి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించారు. నటీనటులు, టెక్నీషియన్స్ కొత్తవాళ్లైనా డెడికేటెడ్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశారు. ముప్పై రోజుల్లో షూట్ పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది’ అన్నారు. ఆగస్టులో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. సినిమాటోగ్రాఫర్ అక్కెనపల్లి సుధాకర్, ఎడిటర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.