నీటమునిగిన పౌల్ట్రీఫామ్..కోళ్లను పట్టుకెళ్లిన స్థానికులు

నీటమునిగిన  పౌల్ట్రీఫామ్..కోళ్లను పట్టుకెళ్లిన స్థానికులు

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో చెరువులు నిండిపోయి అలుగు పారుతున్నాయి. జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు దరకాసు చెరు ఉప్పొంగుతోంది. దీంతో పక్కనే ఉన్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫాం నీట మునిగిపోయింది. కొన్ని కోళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మిగిలిన కోళ్లను గ్రామస్థులు పట్టుకెళ్లారు. దీంతో ప్రదీప్ రెడ్డికి భారీ నష్టం జరిగింది.