ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. నిన్న సాయంత్రం ఈ మూవీ ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు. ‘ఈ రాతలే.. దోబూచులే’ అంటూ సాగే ఈ పాటను జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేశాడు. యువన్ శంకర్రాజా, హరిణి పాడారు. ‘ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా.. విడిపోని యాత్రికులా.. వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే.. ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే.. కలవడం ఎలా ఎలా.. రాసే ఉందా రాసే ఉందా..’ అంటూ సినిమా కాన్సెప్ట్కి దగ్గరగా ఉండేలా లిరిక్స్ రాశారు కృష్ణకాంత్. యానిమేషన్ విజువల్స్తో డిజైన్ చేసిన వీడియో ఆకట్టుకుంది. నిన్న సాయంత్రం ఐదు గంటలకే సాంగ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన మేకర్స్, రాత్రి తొమ్మిది గంటల తర్వాత విడుదల చేశారు. ఆలస్యానికి హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్కి వ్యతిరేకంగా ట్వీట్స్ చేశారు. పాట విడుదలయ్యాక మాత్రం సూపర్ సాంగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.