
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఓ ఫోటో తాజాగా నెట్టింట్లో దర్శనమిచ్చింది.
ప్రభాస్, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. జంట చూడచక్కగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కానీ పూర్తి భద్రతతో షూటింగ్ నిర్వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫోటో ఎలా లీకైందనే విషయం ఇంకా తెలియరాలేదు.