ఏపీలో ఏటీఎం చోరీ చేసి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు తనిఖీలు ఉండటంతో కారు వదిలేసి పరారయ్యారు దుండగులు. శనివారం ( ఏప్రిల్ 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఏపీలో ATMలో చోరీ చేసి హైదరాబాద్ కు వస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. చిట్యాల దగ్గర నేషనల్ హైవేపై తనిఖీలు ముమ్మరం చేశారు.
పోలీసుల తనిఖీలు గమనించిన దొంగల ముఠా కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ లో వదిలేసి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న నల్గొండ పోలీసులు పరారైన దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారులో సేకరించిన ఆధారాల ద్వారా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు.

