సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన : రేషన్, హెల్త్ కార్డుల వివరాల సేకరణ

సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన : రేషన్, హెల్త్ కార్డుల వివరాల సేకరణ

సెప్టెంబర్ 17 నుంచి పదిరోజుల పాటు ప్రజాపాలన నిర్వహించాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూర్తిహెల్త్ ప్రొఫైల్ తో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 

మరో వైపు  స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోశామహల్ కు తరలించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్ లను రూపొందించాలన్నారు. వచ్చేయాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని చెప్పారు. 

భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు వేయాలన్నారు సీఎం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు వేయాలన్నారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామన్నారు రేవంత్ రెడ్డి.