అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం : తండ్రి నరేందర్

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం : తండ్రి నరేందర్

నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో స్టూడెంట్ ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్మో మీదనే ప్రీతికి ట్రీట్మెంట్ నడుస్తోందన్న ఆయన.. డాక్టర్లు, అధికారులు చెప్పేది అంతా అబద్ధమని అన్నారు. గట్టిగా తట్టి లేపితేనే.. కళ్ళు బ్లింక్ చేస్తుందన్నారు. స్వతహాగా ప్రీతి శ్వాస తీసుకోవడం లేదని, మిషన్ ద్వారానే తీసుకుంటుందని చెప్పారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

అంతకు ముందు నిమ్స్ హాస్పటల్ లో ప్రీతిని, ఆమె కుటుంబ సభ్యులను మహిళా, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితులను  అడిగి తెలుసుకున్న ఆమె.. నిన్నటితో పోల్చితే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చిందన్నారు. తట్టి లేపితో కళ్ళు తెరుస్తుందని చెప్పారు. ఎంత ఖర్చైనా మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. దోషులు ఎవరైనా గానీ.. ఉపేక్షించేది లేదన్న ఆమె... రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందన్నారు.