ఏం పోయేకాలం రా : రాజస్థాన్లో మరో మణిపూర్ ఘటన.. అందరి ముందు మహిళ దుస్తులు విప్పారు..

ఏం పోయేకాలం రా : రాజస్థాన్లో మరో మణిపూర్ ఘటన.. అందరి ముందు మహిళ దుస్తులు విప్పారు..

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో  మణిపూర్ తరహా ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు ఓ భర్త...  ఆమెను కొట్టి నగ్నంగా ఊరేగించాడు. ఇందుకు బాధితురాలి అత్తమామ కూడా సహకరించారు. ఇంతా దారుణమైన ఘటన కళ్లముందే జరిగితే ఆపడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంతేకాదు... ఈ తతంగాన్ని మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ..  బాధితురాలికి ఏడాది కిత్రం వివాహమైంది. ఆమె గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె అత్తమామలు, భర్త గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కిడ్నాప్​ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి అత్తమామలు, భర్తే ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలిని ఆమె భర్త.. గ్రామంలో కిలోమీటర్​పాటు నగ్నంగా ఊరేగించాడు. 

ALSO READ :రైల్లోని టాయ్లెట్లో మహిళ శవం.. ఎవరైనా చంపారా లేక మరేదైనా..?

ఈ ఘటనకు సంబంధించి  మహిళ భర్తతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా తెలిపారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉన్నారని,  నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించే క్రమంలో వారంతా గాయపడినట్లు చెప్పారు. వారు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఉమేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ధరియావాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడా గ్రామపంచాయతీలోని నిచల్‌కోట గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది.

కాగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ స్పందించారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్​ చేస్తామని తెలిపారు.