హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. గర్భిణి మృతి

హిమాయత్ నగర్ లో  రోడ్డు ప్రమాదం.. గర్భిణి మృతి

హైదరాబాద్ హిమయత్ నగర్ వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్ ను వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిద్దరు ఇద్దరు వ్యక్తులు ముషీరాబాద్ బకారానికి  చెందిన సతీష్ గౌడ్ , షాలిని దంపతులుగా గుర్తించారు పోలీసులు. తీవ్ర గాయాలైన షాలిని గర్భిణీ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భర్త సతీష్ అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.