రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రం.. ‘ప్రేమిస్తే’ భరత్ ఆన్ బోర్డ్.. డైరెక్టర్ ఎవరంటే?

రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రం.. ‘ప్రేమిస్తే’ భరత్ ఆన్ బోర్డ్.. డైరెక్టర్ ఎవరంటే?

‘ప్రేమిస్తే’చిత్రంతో నటుడిగా గుర్తింపు అందుకున్న భరత్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. లీడ్ రోల్‌‌ మూవీస్ చేస్తూనే.. పలు చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మరో మూవీలో ఆన్ బోర్డ్ అయినట్టు ఆదివారం ప్రకటించారు.

రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్న  బైలింగ్విల్ ప్రాజెక్టులో భరత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎమోషనల్‌‌ అండ్‌‌ ఎనర్జీతో నిండిన పాత్రలో భరత్ కనిపించబోతున్నాడని, తన  పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

నటుడు ఆరి తన కెరీర్‌‌లో తొలిసారిగా పోలీస్‌‌ ఆఫీసర్‌‌ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటుకంప్లీట్ న్యూ లుక్‌‌లో ఆడియెన్స్‌‌ను సర్‌‌‌‌ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పుడు భరత్‌‌ చేరికతో ఈ కాంబినేషన్‌‌పై క్యూరియాసిటీ పెరిగింది.  రఫ్‌‌నోట్‌‌ ప్రొడక్షన్స్‌‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.