మూడు రోజుల పాటు కర్నాటకలో రాష్ట్రపతి పర్యటన

మూడు రోజుల పాటు కర్నాటకలో రాష్ట్రపతి పర్యటన

మూడు రోజులు రాష్ట్రంలోనే..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పాటు కర్నాటకలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఆదివా రం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి రాష్ట్ర పర్యటన ఇదేనని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకు ముర్ము ​అక్కడే ఉంటారు. సోమవారం మైసూరులో దసరా ఉత్సవాలను ప్రెసిడెంట్​ ప్రారంభిస్తారు. హుబ్లీ ధార్వాడ్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం బెంగళూరులో హిందుస్తాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​కు చెందిన ఇంటిగ్రేటెడ్​ క్రయోజెనిక్​ ఇంజిన్​ల తయారీ ప్లాంట్​ను ఓపెన్​ చేస్తారు. బెంగళూరులో ఆమె గౌరవార్థం కర్నాటక ప్రభుత్వం ఏర్పాటుచేసే  విందులో పాల్గొంటారు. తర్వాత 28న ఢిల్లీకి తిరిగి వస్తారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.