రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

ఢిల్లీ : 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో ఇవాళ 56 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. మిగిలినవారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

అవార్డులు అందుకున్న ప్రముఖులు వీరే..

నటుడు మోహన్‌లాల్‌- పద్మభూషణ్‌

సర్దార్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిల్సా – పద్మభూషణ్‌

హకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ – పద్మభూషణ్‌

ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్‌ నయ్యర్‌(మరణానంతరం) -పద్మభూషణ్‌(ఈ అవార్డును ఆయన భార్య భారతి నయ్యర్‌ అందుకున్నారు)

రెజ్లర్‌ భజరంగ్‌ పునియా – పద్మశ్రీ

చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక – పద్మశ్రీ

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌ కమల్ – పద్మశ్రీ

విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్‌ – పద్మశ్రీ

నటుడు ప్రభుదేవా – పద్మశ్రీ

సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ – పద్మశ్రీ

కబడ్డీ ఆటగాడు అజయ్‌ ఠాకూర్‌ – పద్మశ్రీ