ఎలక్ట్రిక్ కెటిల్​ను అందుబాటులోకి తెచ్చిన ప్రెస్టీజ్

ఎలక్ట్రిక్ కెటిల్​ను అందుబాటులోకి తెచ్చిన ప్రెస్టీజ్

హోం అప్లయెన్సెస్​ సంస్థ ప్రెస్టీజ్ పీకేఎన్​ఎస్​ఎస్​ 1.0 పేరుతో ఎలక్ట్రిక్ కెటిల్​ను అందుబాటులోకి తెచ్చింది.  ఇది టీ, కాఫీ వంటి బేవరేజెస్​ను వేగంగా వేడి చేస్తుంది. దీని  డిజైన్​ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ కెటిల్​ను అధిక- నాణ్యత గల స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారు చేశామని ప్రెస్టీజ్​ తెలిపింది. అంతేగాకుండా ఇది వెడల్పాటి మౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తుంది కాబట్టి  శుభ్రపరచడం సులభమవుతుంది. దీని ధర రూ.749.