ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దు

ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దు

తెలంగాణలో ప్రియాంక గాంధీ  పర్యటన రద్దయింది.   తెలంగాణ రాష్ట్రానికి రేపు (27వ) తేదీన  కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ  చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్​ ఖరారు చేశారు.  మొదట ప్రియాంక గాంధీ చేతుల మీదుగా.... చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్​ సర్కార్​ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె టూర్​ అకస్మాత్తుగా అనివార్య కారణాలతో రద్దయింది.  దీంతో సీఎం రేవంత్​ రెడ్డి రేపు ( ఫిబ్రవరి 27)  ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్  రెండు గ్యారంటీలను అమలుచేయనున్నారు.