
14 ఏళ్ళ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 14 ఏళ్ళ వయసులో అతని ప్రతిభను చూసి ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయింది. వైభవ్ ఆట ఏకంగా భారత ప్రధాని దగ్గరకు చేరిందంటే అతను ఎలా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా వైభవ్ సూర్యవంశీని భారత ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. పాట్నాను సందర్శిస్తున్న నరేంద్ర మోడీ.. క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అతని కుటుంబ సభ్యులను పాట్నా ఎయిర్ పోర్ట్ లో కలిశారు. మోడీతో కాసేపు మాట్లాడిన తర్వాత వైభవ్ ప్రధాని పాదాలు టచ్ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.
"పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. అతని కుటుంబ సభ్యులను కలిశాను. అతని క్రికెట్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా వైభవ్ సూర్యవంశీతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన తర్వాత, వచ్చే నెలలో ఇంగ్లండ్లో పర్యటించే ఇండియా అండర్–19 జట్టులో రాజస్తాన్ రాయల్స్ సెన్సేషనల్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చాన్స్ దక్కింది. జూన్ 24న 50 ఓవర్ల వామప్ మ్యాచ్తో మొదలయ్యే ఈ సిరీస్లో ఐదు యూత్ వన్డేలు జరగనున్నాయి.
ఐపీఎల్ లో 35 బంతుల్లో సెంచరీతో ప్రపంచ క్రికెట్ ను వైభవ్.. ఐపీఎల్ 2025 సీజన్ లో 7 మ్యాచ్ ల్లో 200 పైగా స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుకు ఆశాకిరణంలా మారాడు. 35 బంతుల్లో రికార్డ్ సెంచరీతో ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించిన సూర్యవంశీ ప్రదర్శనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసించారు. సూర్యవంశీకి బీహార్ ముఖ్యమంత్రి రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
PM Narendra Modi meeting Vaibhav Suryavanshi and his family. ❤️pic.twitter.com/k5uTIhCCk4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2025