
సిక్కుల గురువు తేగ్ బహదూర్కు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. సిక్కు మత గురువు తేగ్ బహదూర్ను ఖననం చేసిన రకాబ్ గంజ్ గురుద్వారాను మోడీ ఆదివారం సందర్శించారు. మోడీ పర్యటన సందర్భంగా గురుద్వారాలో ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
‘ఈ ఉదయం శ్రీ గురు తేగ్ బహదూర్ జీ యొక్క మృతదేహాన్ని దహనం చేసిన చారిత్రాత్మక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ వద్ద ప్రార్థనలు చేసి.. ఆయన ఆశీర్వదాలు పొందాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలాగే నేను కూడా గురు తేగ్ దయతో ఎంతో ప్రేరణ పొందాను. గురు సాహిబ్ యొక్క 400వ పార్కాష్ పర్వ్ సందర్భంగా ఈ ప్రభుత్వ కాలంలో ఆయన సేవలను గుర్తించబోతున్నాం’అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గురు తేగ్ బహదూర్ సిక్కుల యొక్క తొమ్మిదవ సిక్కు గురువు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను సిక్కు రైతులే ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ముఖ్యమైన గురుద్వారాల్లో ఒకటైన రకాబ్గంజ్ గురుద్వారాను ప్రధాని సందర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది.
For More News..