ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8వ తేదీన  హైదరాబాద్ లో పర్యటిస్తారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.45 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు.  సికింద్రాబాద్‌-- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12.15 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ తో  వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. 

సికింద్రాబాద్ టూ తిరుపతి...

తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ  ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభిస్తారు. ఇప్పటికే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ఓ రైలు అందుబాటులో ఉండగా..తాజాగా  సికింద్రాబాద్‌- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్‌ రైలును ప్రధాని మోడీ ప్రారంభిం చనున్నారు. ఈ  వందే భారత్‌ రైల్లో తిరుపతికి కేవలం 8:30 గంటల్లో చేరుకుంటారు. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే వందే భారత్‌ ఎక్స్ ప్రెస్  నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అయితే  ప్రారంభోత్సవం రోజున మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది. 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు ప్రారంభం..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. దాదాపు రూ.700ల కోట్లతో  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ది పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన నిర్మాణ డిజైన్‌తో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రూపుదిద్దుకోనుంది. అయితే  రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా దశలవారీగా అభివృద్ధి పనులను చేయనున్నారు. రాబోయే 40ఏళ్ల వరకు ప్రయాణికుల  అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాల కల్పనతో ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేయనున్నారు. 

3 దశల్లో పనులు..

ప్రయానికులకు ప్రత్యేక ఎంట్రీ-, ఎగ్జిట్‌ బ్లాక్‌ల వంటి ప్రత్యేక సదుపా యాలు ఉండనున్నాయి. వెహికిల్స్ వెళ్లేందుకు స్టేషన్‌లో మల్టీ లెవల్‌, అండర్‌ గ్రౌండ్‌ కార్‌ పార్కింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.  కొత్త స్టేషన్‌ బిల్డింగ్‌లో  పాసింజర్ల  సౌకర్యం కోసం  అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఎలక్ట్రానిక్‌ సైన్‌ బోర్డులతో సహా ఆధునికీకరించిన సౌకర్యాలు ఉండనున్నాయి.  రైల్వే స్టేషన్‌కు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 5వేల KWP సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు- చేయనున్నారు. స్టేషన్‌ అవసరాల కోసం 16 లక్షల లీటర్ల నిల్వ సామర్థంగల 4  GLR  సంప్‌లు ఏర్పాటు- చేస్తారు. 

 
MMTS  రెండో దశ సేవలు

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ MMTS  రెండో దశ సేవలు ప్రారంభిస్తారు.  మేడ్చల్‌- సికింద్రాబాద్‌- ఉందానగర్‌, మేడ్చల్‌ -సికింద్రాబాద్‌- తెల్లాపూర్‌ మధ్య MMTS  రైళ్లు ఈనెల 8వ తేదీ నుంచి అందుబాటు-లోకి వస్తాయి.  2003లో MMTS  ఫస్ట్ ఫేజ్ సేవలు అందుబాటు-లోకి వచ్చాయి. ఆ తర్వాత 2014లో ఎంఎంటీ-ఎస్‌ రెండవ దశ పనులు మొదలయ్యాయి.  రూ.816 కోట్లతో 95 కిలో మీటర్ల మేర పనులను రైల్వే శాఖ చేపట్టింది.  రెండో దశలో సికింద్రాబాద్‌ -మేడ్చల్‌ మార్గంలో 28 కిలో మీటర్ల వరకు ఉంటు-ంది. ఈ మార్గంలో లాలాగూడ గేట్‌, మల్కాజ్‌గిరి, దయానంద నగర్‌, సఫిల్‌గూడ, ఆర్‌.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్‌, అల్వాల్‌, బొల్లారం బజార్‌, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు అందుబాటు-లోకి రానున్నాయి. ఫలక్‌నుమా- ఉందానగర్‌ మధ్య శివరాంపల్లి, బుద్వేల్‌ స్టేషన్లు అందుబాటు-లోకి వస్తున్నాయి. 
న్నట్లు- రైల్వే అధికారులు తెలిపారు. 

 ఏర్పాట్లు పూర్తి.. 

ప్రధాని టూర్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోడీ పర్యటన ఏర్పాట్లు, భద్రతపై సీఎస్‌, డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర  బీజేపీ నేతలు, శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ తరఫున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు,  బ్యానర్లు కట్టారు.