
ప్రిన్స్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. కుమార్ రవికంటి దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. సుహానా ముద్వాన్ హీరోయిన్గా నటిస్తోంది. సునైనా, నెల్లూరు సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత కుమార్ మాట్లాడుతూ ‘ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. మూడు నెలల్లో టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత విదేశాలలో సాంగ్స్ షూట్ చేయనున్నాం. ప్రిన్స్ కెరీర్లో ఇది స్పెషల్ మూవీగా నిలవనుంది’ అని చెప్పారు.