తెలంగాణకు ప్రియాంక గాంధీ.. ఖానాపూర్, ఆసిఫాబాద్ లో సభలు

తెలంగాణకు ప్రియాంక గాంధీ..   ఖానాపూర్, ఆసిఫాబాద్ లో సభలు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ జనరల్​సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ సభల్లో పాల్గొననున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయల్దేరి, ఉదయం 10:30 గంటలకు ఖానాపూర్ చేరుకుంటారు. అక్కడ సభలో పాల్గొని, అనంతరం ఆసిఫాబాద్ చేరుకుంటారు. 

నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచారంలో భాగంగా అక్కడి నుంచి ఒక తండాకు వెళ్లి స్థానిక మహిళలతో ఇంటరాక్ట్​ అవుతారు. వారితో కలిసి ప్రచారం నిర్వహిస్తారు. ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారంటీలను వివరిస్తారు. గిరిజనుల ప్రత్యేక వంటకాలతో భోజనం చేస్తారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రచారం పూర్తి కాగానే, నాందేడ్​కు తిరిగి ప్రయాణమవుతారు.