యూపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. డోర్ టు డోర్ ప్రచారంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నోయిడాలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంఖూరి పాఠక్ కు ఓట్లు వేసి అతడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రియాంక గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం