మనం పెట్టె ప్రతి రూపాయి స్క్రీన్పై కనపడేలా చెయ్యాలి

మనం పెట్టె ప్రతి రూపాయి స్క్రీన్పై కనపడేలా చెయ్యాలి

మనం పెట్టె ప్రతీ రూపాయి స్క్రీన్ పై కనపడేలా చెయ్యాలి తప్ప వెస్టేజ్ మాత్రం చెయ్యకూడదన్న నాన్న మాటలను గుర్తు పెట్టుకుంటాను అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. ద‌ర్శకుడిగా న‌టుడిగా తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ‌తాధిక ద‌ర్శకుడు కోడి రామ‌కృష్ణ. ఆయన పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా రాణిస్తోంది.

ఆమె ప్రస్తుతం "నేను మీకు బాగా కావాల్సినవాడిని" అనే కమర్సియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇద్దరి లైఫ్ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్న కథ ఇది. ఈ కథలో వారిద్దరూ ఎక్కడ రియలైజ్ అవుతారనే సస్పెన్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిద్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్‌, భరత్ రొంగలి నటీనటులు. యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఈ సినిమాలో కిరణ్ అబ్బవ‌రం కొత్తగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న.. బెయిల్ ఇచ్చి పోరాదే.. అంటూ సాగే సాంగ్ మాస్ బీట్ తో అందర్నీ ఆకట్టు కుంటుంది. పక్కా కమర్షియల్ పంథాలో సాగిపోయే ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. జులై 8న ఈ చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి బర్త్ డే సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్య దీప్తి పలు విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం.. 

డైరెక్షన్ చేసి అయన పేరు చెడగొట్ట కూడదని..

"నాకు డైరెక్షన్ చేయడమంటే చాలా ఇష్టం. నాన్న ద్వారా నేను దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకున్నాను. నా వెడ్డింగ్ తరువాత మా వారు కూడా డైరెక్షన్ చెయ్యమని నన్ను ఎంకరేజ్ చేశారు. దాంతో నేను కూడా చేద్దాం అనుకున్న.. ఆ టైంలో మా డాడీ హార్ట్ స్ట్రోక్ తో మరణించారు.. అయితే తెలుగు ప్రేక్షకులతో మా నాన్నకు విడదీయరాని బంధం ఉంది. కేవలం దర్శకుడిగానే కాకుండా వ్యక్తిత్వం తోనూ ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటిది నేను డైరెక్షన్ చేసి అయన పేరు చెడగొట్ట కూడదని బ్యాక్ స్టెప్ తీసుకున్నాను.

ఆయన అడుగు జాడలలో నడుస్తూ..

మా నాన్న తన శతాధిక చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసి సినీ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిన దిగ్గజదర్శకులు. ఆయన సృష్టించిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆ స్పూర్తి తోనే పెద్ద కుమార్తెగా ఆయన అడుగు జాడలలో నడుస్తూ వారి దివ్యాసిస్సులతో ముందుకు వెళ్లాలని నిర్మాతగా మారి కోడి దివ్య ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరంతో "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం చేస్తున్నాను. మా నాన్న ఉన్నపుడే నేను కిరణ్ తో చేద్దాం అని కథలు విన్నాను. అయితే అప్పుడు కుదరలేదు. దాంతో తను యస్.ఆర్. కల్యాణమండపం సినిమాకు మూవ్ అవ్వడం జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. మా నాన్న మాతో ఎప్పుడూ చెప్పేవారు మనం పెట్టె ప్రతి రూపాయి స్క్రీన్ పై కనపడేలా చెయ్యాలి తప్ప వెస్టేజ్ మాత్రం చెయ్యకూడదు అనేవారు. దాన్ని మనసులో పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాను. ఇద్దరి లైఫ్ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ తో ఈ కథలో వారిద్దరూ ఎక్కడ రియలైజ్ అవుతారనే సస్పెన్స్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు మెయిన్ టర్నింగ్ పాయింట్స్ బాగా సెట్ అయ్యాయి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ అయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోయిన్ కు ఫాదర్ గా యస్. వి. కృష్ణా రెడ్డి యాక్ట్ చేస్తున్నారు. అలాగే బాబా భాస్కర్.. ఇలా చాలామంది నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సెట్ అయ్యారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ చేయడం చాలా సంతోషం. వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు జరిగే సాంగ్ తో షూటింగ్ పూర్తవుతుంది.

కమర్సియల్ సినిమాలు తీయడం అంటే ఇష్టం..

మా నాన్నకి రియాలిస్టిక్ గా ఉండే సబ్జెక్టుతో కొత్తవారితో తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో సినిమా తీయాలనే కోరిక ఉండేది.. అయితే అది అవ్వలేదు. నాకు కమర్సియల్ ఎంటర్ టైనర్ సినిమాలు తీయడం అంటే ఇష్టం. ఈ మధ్య ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించాలి అంటే చాలా కష్టపడాలి. దర్శకులు నాకు చెప్పే కథ విన్నప్పుడు ఏ జానర్ అయినా కానీ వారు చెప్పిన కథ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ప్రేక్షకులు ఏ పాయింట్ కొరకు చివరి వరకు వెయిట్ చేస్తారు అనే పాయింట్ చూసుకుంటాను. మొదట నేను ఆ పాయింట్ కు రియాక్ట్ అయితే అప్పుడు ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతారని నమ్మి సినిమా చేయడానికి ముందుకు వస్తాను.

నా దగ్గర చాలా కథలు ఉన్నాయి..

దర్శకుడు శ్రీధర్ గాదెకు కిరణ్ కు బాగా ర్యాపో ఉంది. బేసిక్ గా శ్రీధర్ ఎడిటర్. స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ పెడితే  ప్రేక్షకులు రియాక్టర్ అవుతారో అనే టైమ్ సెన్స్ తనకు బాగా తెలుసు. అలాగే తను తీసిన యస్. ఆర్ కల్యాణమండపం కూడా బిగ్ హిట్ అయ్యింది. తను మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తాడు. ఈ కథలో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. రేపు మేము ఈ సినిమా టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము. అయితే మేము షూట్ లో బిజీగా ఉండడం వలన 10వ తేదీన పాలకొల్లులో చిత్ర టీజర్ ను రిలీజ్ చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలియజేస్తాను" అని దివ్య దీప్తి ముగించారు.