NTR,Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే.. తారక్ కార్తికేయుడిగా.. నాగవంశీ ఫుల్ క్లారిటీ!

NTR,Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే.. తారక్ కార్తికేయుడిగా.. నాగవంశీ ఫుల్ క్లారిటీ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ కాంబో అధికారికంగా ఫిక్స్ అయింది. లేటెస్ట్ గా త్రివిక్రమ్ నుంచి రాబోయే రెండు సినిమాలను నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. తన Xఖాతాలో పోస్ట్ చేస్తూ త్రివిక్రమ్ సినిమాలను కన్ఫర్మ్ చేసేశాడు.

'త్రివిక్రమ్ తదుపరి 2 ప్రాజెక్టులు లాక్ అయ్యాయి. అందులో మొదటి సినిమా వెంకీమామతో తరువాతి సినిమా తారక్ అన్నతో ఉంటాయి. ఇవి తప్పా.. మిగతా సినిమాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్. త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసిన ప్రాజెక్ట్‌లను నా సోషల్ మీడియా వేదిక నుంచి అప్డేట్స్ ప్రకటిస్తాను' అని నాగవంశీ తన ట్వీట్ లో వెల్లడించాడు. 

తెలుగు సినీ రంగంలోని అతికొద్ది మంది టాలెంట్ ఉన్న దర్శక రచయితలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్టైలిష్ కథా కథనాలను మాస్ అప్పీల్‌తో సులభంగా మిళితం చేస్తారు. ఆయన పెన్నులోని పవర్ను వెంకటేష్ గత సినిమాలైనా మల్లీశ్వరీ, నువ్వు నాకు నచ్చావు వంటి వాటికి స్టోరీస్ ఇచ్చాడు. 

ఇన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్-వెంకీ కాంబో సెట్ అవ్వడంతో అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి అరవింద సమేత వీర రాఘవ మూవీకి గాను వర్క్ చేశారు. నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథను తనదైన శైలిలో చెప్పి ఎన్టీఆర్కు మంచి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఈ కాంబో సెట్ అవ్వడంతో తమ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ టైటిల్:

నిర్మాత నాగవంశీ చేసిన పోస్ట్ చాలా ప్రశ్నలకి ముందే సమాధానం ఇచ్చింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ మైథలాజికల్ ఫాంటసి ఫిల్మ్గా వస్తోంది. నాగ వంశీ 'కార్తికేయ స్వామి శ్లోకాన్ని' పోస్ట్ చేస్తూ.. అందులో 'స్కంద సేనాని' అనే పదాన్ని హైలెట్ చేశారు. దీంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ అదే టైటిల్తో రాబోతుందని, ఈ సినిమాలో తారక్ కార్తికేయుడిగా నటిస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇందులో నిజం లేకపోలేదు. నాగవంశీ ఒక అభిమానిగా అన్నీ ముందే చెప్పుంటాడు అనే డౌట్ ఎన్టీఆర్ అభిమానుల్లో నాటుకుపోయింది. ముందు ముందూ నాగవంశీ మరెన్నీ రివీల్ చేయనున్నాడో చూడాలి.

త్రివిక్రమ్ స్క్రిప్ట్కి ఎక్కువ సమయం తీసుకున్నారా?

మొదట్లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ ప్రొడక్షన్ నంబర్ 8గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ సమర్పణలో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పౌరాణిక అంశాలతో కూడిన భారీ స్థాయిలో నిర్మించాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ ప్రీ-ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడని, అల్లు అర్జున్ వేచి ఉండలేకపోయాడని తెలుస్తోంది. అందులో భాగంగా అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో తన కొత్త చిత్రాన్ని ప్రకటించినట్లు సినీ వర్గాల టాక్.