తెలంగాణ వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనమైందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానభవన్ లో విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ తో పాటు విద్యావ్యవస్థ పూర్తిగా ఆగం అయిపోయిందన్న ఆయన.. కేజీ టూ పీజీ విద్యను విస్మరించారని తెలిపారు. ముఖ్యమంత్రికి విద్యారంగపై రివ్యూ చేసేంత టైం కూడా లేదని..విద్యారంగం కోసం ప్రభుత్వం దగ్గర నిధులు కూడా కేటాయించడం లేదన్నారు. తెలంగాణలోనే విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యావ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం 20 నుంచి 30 ఏళ్లు వెనకబడిందన్నారు హరగోపాల్. మళ్లీ ముందుకు వెళ్లాలంటే వచ్చే ప్రభుత్వం దశాబ్దం పాటు కష్టపడితే తప్ప బాగుపడే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు కనబడే పరిస్థితి లేదన్నారు.వర్శిటీల్లో వైస్ ఛాన్స్ లర్లను అపాయింట్ మెంట్ చేయడానికి కూడా సీఎంకు టైం దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రశ్నించే వారిపై ప్రభుత్వం ఉప చట్టం అమలు చేయడం దుర్మార్గమన్నారు హరగోపాల్. ప్రశ్నించిన వారిని ప్రభుత్వం జైల్లో పెడుతుందని విమర్శించారు. ఈ ఉప చట్టాలు రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. తెలంగాణలో ప్రభుత్వం 400 మందిపై ఉప చట్టం కేసులు పెట్టిందని.. ప్రభుత్వం ఎందుకు కేసులు పెడుతుందో చెప్పడం లేదన్నారు. ఎన్నో మంచి తీర్పులు ఇచ్చిన జస్టిస్ సురేష్ పై ఉప కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉప చట్టంను ఎత్తివేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఇబ్బంది పడతారని హెచ్చరించారు హరగోపాల్.