బీఆర్ఎస్ హయంలో జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు చూడలేదు : కోదండరాం

బీఆర్ఎస్ హయంలో జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు చూడలేదు : కోదండరాం

న్యాయాన్ని పక్కన పెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణి పోర్టల్ మాదిరిగా ఉంటుందన్నారు టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం. గత ప్రభుత్వ హయంలో ధరణితో ఇష్టానుసారంగా భూములు రాయించుకోవాలని చూశారని ఆరోపించారు. పేదలకు మేలు చేసే విధంగా చట్టం రావాలని కోరారు. గ్రామ స్థాయి వరకు యంత్రాంగం ఉండాలని, నియమాలు, తప్పులు దొర్లకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. 

గతంలో ఇంత విధ్వంసం ఎప్పుడు చూడలేదన్నారు. రావణుడి చేతిలో సీతమ్మ బంది అయినట్లు తెలంగాణ పదేళ్లు బందీ అయ్యిందని చెప్పారు. కేసీఆర్ సింహాసనం, ఫామ్ హౌస్ లో భాగం ప్రజలెవరూ అడగలేదన్నారు. అందరం చట్టబద్దంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పాలకుల కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలన్నారు. 

హైదరాబాద్ బేగంపేట ది హరిత ప్లాజాలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి హాజరయ్యారు.