ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై నిషేధం

ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై నిషేధం
  • డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల  ప్రకారం కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల ద్వారా  ప్రచారం చేయకూడదని చెప్పారు.