ప్రాజెక్టులకు జలకళ..నాగార్జున సాగర్కు భారీ వరద

ప్రాజెక్టులకు జలకళ..నాగార్జున సాగర్కు భారీ వరద

మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాలా, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లుఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.  

ఎగువనుంచి జూరాల ప్రాజెక్టుకు లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం7.95 టీఎంసీలుగా ఉంది.  అదనంగా వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

జూరాల నుంచి వస్తున వరదనీటితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది.శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులకు చేరింది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. 

►ALSO READ | కేసీఆర్ పాలనలోనే నీటి వాటాలో తెలంగాణ అన్యాయం : మంత్రి ఉత్తమ్ కుమార్

శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి వరద పెరిగింది. సాగర్ కు ఎగువనుంచి 1లక్షా 17వేల 764 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి 4వేల 646 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు.