సాగర్‌లో భారీగా తెలుగు రాష్ట్రాల పోలీసులు

సాగర్‌లో భారీగా తెలుగు రాష్ట్రాల పోలీసులు

నాగార్జున సాగర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం కారణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు పెంచాయి. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం కారణంగా భద్రతను పెంచాయి ఉభయ రాష్ట్రాలు. ఏపీ, తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి ఉద్యోగులు మినహా ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు.  గుంటూరులోని పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఏపీ సర్కార్ భారీగా పోలీసులను మోహరించింది. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసుల పహారా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.